పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని జ్యోతుల సాయి జ్యోతిని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 983 మార్కులు సాధించి కాకినాడ జిల్లాలోని మొదటి స్థానం సాధించిన సందర్భంగా గురువారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సాయి జ్యోతిని సత్కరించి రూ.10వేల చెక్కును అందజేశారు.