దేశానికి రెండుసార్లు ప్రధానిగా సేవలు అందించిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ (92) ఇక లేరని కాకినాడ సిటీ అధ్యక్షుడు చెక్క నూకరాజు పేర్కొన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిటీ అధ్యక్షుడు నూకరాజు, పీసీసీ సభ్యులు శ్రీనివాస్ రావు, తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి దారి చూపిన ఆర్థిక దిక్సూచి ఇకలేరని ఆయన తెలిపారు.