నేరాల నుండి రక్షణ కోసం వివిధ ప్రాంతాలలో పోలీస్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పేర్కొన్నారు. గత రాత్రి జిల్లా ఎస్పీ స్వయంగా కోరంగి చెక్పోస్ట్ వద్ద వాహనదారులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, రైల్వే స్టేషన్, బస్టాండ్లతో పాటు వివిధ ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ తనిఖీలలో ఎస్పీ వెంట కాకినాడ డి. ఎస్. పి మనీష్ దేవరాజ్ పాటిల్, రూరల్ సీఐ చైతన్య కృష్ణ, కోరంగి ఎస్ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.