కాకినాడ దేవాలయం వీధిలో ట్రాఫిక్-1 సీఐ రమేశ్ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై సోమవారం అవగాహన కల్పించారు. ట్రాఫిక్ను ఆపి, హెల్మెట్ ఉపయోగం వల్ల ప్రాణాలు ఎలా రక్షించుకోవచ్చో వివరించారు. ప్రతిరోజూ అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో మార్పు లేకపోవడం బాధకరమన్నారు. హెల్మెట్ పెట్టుకోవడం ప్రతి ద్విచక్రవాహనదారుడి బాధ్యతగా పేర్కొన్నారు.