కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాధపురం ఎమ్మెల్యే ఇంటి వద్ద బుధవారం సాయంత్రం పీఆర్ ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలకు చెందిన సాయి లక్ష్మి షైనింగ్ స్టార్స్ - 25లో రాష్ట్ర స్థాయిలో ఎలక్ట్రానిక్స్ గ్రూపులో 1000కి 982 మార్కులు సాధించిన నేపథ్యంలో ఎమ్మెల్యే కొండబాబు సాయిలక్ష్మిని అభినందించారు.