డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య అప్పట్లో కాకినాడలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు దీనిపై ప్రాసిక్యూషన్ కు సహాయం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల సుబ్బారావును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇదే కేసుపై న్యాయ పోరాటం చేసిన ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా నియమించడం గమనార్హం.