రైలులో ప్రయాణికురాలు పోగొట్టుకున్న రూ.17 లక్షల విలువైన వస్తువులు కలిగిన హ్యాండ్ బ్యాగ్ ను పోలీసులు తిరిగి బాధిత మహిళకు అప్పగించారు. కాకినాడ పోర్టు రైలు బండిలో తిరుపతి నుండి విజయవాడకు ప్రయాణమైంది. అయితే ఆమె విజయవాడ రైల్వే స్టేషన్లో రైలు దిగి తనతో వెంట తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్ ను వదిలి ఇంటికి వెళ్లిపోయింది. విషయం పోలీసులకు చెప్పడంతో వారు ఆమె ప్రయాణించిన రైలును నిలుపుదల చేయించి ఆమె ప్రయాణించిన భోగిలో ఆమె బ్యాగును గుర్తించి అప్పగించారు.