కాకినాడ: ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రజాదర్బార్

71చూసినవారు
కాకినాడ: ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రజాదర్బార్
జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు శుక్రవారం నాల్గవ ప్రజాదర్బార్‌ ను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించారు. దీనిపై ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, తమ సమస్యల పై నేరుగా విన్నవించుకొనే ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతో ఆత్మీయంగా, ఉపయోగకరంగా నిలిచిందని ఈ రోజు 22 వినతులు స్వీకరించి వాటిలో అప్పటికప్పడు 5 వాటిని పరిష్కరించామని క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ మేకా లక్ష్మణ మూర్తి తెలియజేసారు.

సంబంధిత పోస్ట్