అధిక వడ్డీ పేరుతో రూ.457.48 కోట్ల మేర ప్రజల నుంచి సేకరించి, తిరిగి వాటిని చెల్లించకుండా బోర్డు తిప్పేసిన కాకినాడలోని జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆస్తులను ప్రభుత్వం శుక్రవారం జప్తు చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ మార్కెట్ వాల్యూ ప్రకారం, రూ.7.53 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను జప్తు చేసినట్టు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.