కాకినాడ జిల్లాలో ఈ నెల 19వ తేదీన ప్రతీ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుంచి స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంపై జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, మండల అభివృద్ధి అధికారులతో జిల్లా కలెక్టర్ టేలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.