ప్రభుత్వ పాఠశాలల్లోనే నిష్ణాతులైన ఉపాధ్యాయులతో విద్యా ర్థులకు బోధన అందిస్తారని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. గురువారం కాకినాడ రాజీవ్ గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో కాకినాడ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మెగా వార్షికోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలిత ముఖ్య అతిథులు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసిన నివాళులర్పించారు.