ఈవీఎం, వీవీప్యాట్ (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల) లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును జిల్లా కలెక్టర్ షణ్మోహన్. రెవెన్యూ, ఎన్నికల శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.