పెంపుడు కుక్కలకు విధిగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలని జిల్లా పశు సమర్ధక శాఖ ఇంచార్జీ కె. కృష్ణ మూర్తి పేర్కొన్నారు. కాకినాడ లో ఆదివారం జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుక్కలను తప్పక వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. జిల్లాలో కుక్కలకు యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) చేయిస్తున్నామని పేర్కొన్నారు.