ఉగ్రవాదాన్ని అణిచివేద్దామని, భారత్ కన్నెర్ర చేస్తే ఉగ్రవాదం తోక ముడుచుకోవాల్సిందేనని ప్రధాని మోదీ నిరూపించారని, ఉగ్రవాదుల వ్యతిరేక పోరాటంలో భారత్ చరిత్రాత్మకంగా నిలిచిందని రాజా ట్యాంక్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గ్రంథి బాబ్జి అన్నారు. శుక్రవారం కాకినాడ రాజా ట్యాంక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్ విజయంపై హర్షం తెలుపుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు.