కాకినాడలోని జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో పరిపాలనా భవనం వద్ద భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడిని స్ఫూర్తిగా తీసుకుని వాక్ విత్ నేషన్స్ పేరుతో ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన 194 ప్రపంచ దేశాల జాతీయ పతాకాలను ఏర్పాటు చేశారు. అందులో పాకిస్తాన్ జెండా కూడా ఉంది. అయితే గత వారం రోజులుగా పాకిస్తాన్ - భారతదేశానికి యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయ జెండాను తొలగించాలని అధికారులను కోరారు. అధికారులు స్పందించక పోవడంతో విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు దువ్వ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం పాకిస్తాన్ జెండాను తొలగించి దాన్ని కాల్చి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.