భారతీయ రైల్వే దేశ అభివృద్ధి, భద్రత, సమగ్రతకు ప్రతీకగా నిలుస్తుందని రైల్వే రిటైర్డ్ సూపరిండెండెంట్ మైలవరపు వెంకట లక్ష్మణరావు పేర్కొన్నారు. బుధవారం రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ రైల్వే దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1853 ఏప్రిల్ 16న మొదటి ప్రయాణికుల రైలు బాంబే నుండి ధానే వరకు 30 కిలోమీటర్లు నడవడంతో అప్పటినుండి జాతీయ రైల్వే దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.