కాకినాడ ఈట్ స్ట్రీట్ లో అక్రమాలను కాకినాడ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు బుధవారం తొలగించారు. కార్పొరేషన్ నుంచి కేవలం 52 షాపులకు అనుమతులు తీసుకుని 82షాపులను ఏర్పాటు చేశారు. అదనంగా ఏర్పాటు చేసిన 30 షాపులను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. కార్పొరేషన్ అనుమతులు లేకుండా ఎవరు షాపుల్లో ఏర్పాటు చేయవద్దని అధికారులు సూచించారు. కమిషనర్ వెంకటరావు ఆదేశాల మేరకు తొలగించినట్లు తెలిపారు