జగన్నాధపురం ప్రాంతానికి ప్రత్యేక నీటి ప్రాజెక్టు

74చూసినవారు
జగన్నాధపురం ప్రాంతానికి ప్రత్యేక నీటి ప్రాజెక్టు
కాకినాడ జగన్నాధపురం ప్రాంత ప్రజలకు సమృద్ధిగా మంచినీరు అందించేందుకు ప్రత్యేక ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) అధికారులను కోరారు. గురువారం ఆయన కమిషనర్ జే. వెంకటరావు, అధికారులతో కలిసి అరట్లకట్ట జలాశయాన్ని సందర్శించారు. అక్కడి నుంచి జగన్నాధపురం ప్రాంతానికి నేరుగా మంచినీటిని అందించేందుకు ఉన్న అవకాశాలు, ప్రతిపాదనలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్