వర్షం కారణంగా ఏర్పడే ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలుతీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జే. వెంకటరావు పేర్కొన్నారు. కాకినాడలో లక్ష్మీనారాయణ నగర్ ప్రాంతంలోని మదర్ థెరిసా విగ్రహం నుంచి ఫౌండేషన్ ఆసుపత్రి వరకు ముంపునకు గురైన ప్రాంతాన్ని కమిషనర్ శనివారంసందర్శించారు. ముంపు సమస్య ఎదుర్కొనేందుకు తీసుకోవలసిన చర్యలపై ఇంజనీరింగ్, ప్రజారోగ్య విభాగానికి చెందిన అధికారులతో చర్చించారు.