వంగవీటి రాధాకృష్ణ, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఆహ్వానంపై శనివారం కాకినాడకు విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కాపు నాయకులు పాల్గొంటారు. అనంతరం కాకినాడ జిల్లాలోని పలు గ్రామాల్లో వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణల్లో రాధాకృష్ణ పాల్గొననున్నారు.