విద్యార్థులందరూ క్రమశిక్షణతో, ఇష్టపూర్వకంగా విద్యనభ్యసించి తల్లిదండ్రులకు, పుట్టిన ప్రాంతానికి పేరు తీసుకురావాలని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ పి. ఆర్. మరియు ఒకేషనల్ కళాశాలలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలను కొండబాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.