రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పూర్తైన పనులను ప్రారంభించు కోవడం, కొత్తగా మంజూరైన వాటికి శంఖుస్థాపనలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. బుధవారం కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామాంలో భావనారాయణ స్వామి దేవస్థానం నుంచి వాడపల్లి వరకు బైపాస్ పనులకు శంకుస్థాపన చేశారు.