కాకినాడ రూరల్ చిత్రాడలో ఈనెల 14 తేదీన జరగనున్న జనసేన ఆవిర్భావ సభకు సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తో బుధవారం సాయంత్రం పరిశీలించారు. సభకు మూడు ప్రధానద్వారాలు ఏర్పాటు చేయడం జరిగిందని ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు రాష్ట్ర మంత్రి మనోహర్ ఆదేశించారు.