ప్రమాదాల నివారణకు భద్రతా నియమావళి తప్పనిసరిగా పాటించాలని రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ పేర్కొన్నారు. ఆలమూరు మండలం జొన్నాడ జాతీయ రహదారి, కాకినాడ వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డుపై ఆలమూరు ఎస్సై ఎం అశోక్ తో కలిసి శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ముగ్గురు ద్విచక్ర వాహనదారులను, ఒక ట్రాక్టర్ డ్రైవరు, మరొక లారీ డ్రైవర్ల పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.