స్థానిక ప్రాంతాల అభివృద్ధి కి ఓఎన్జీసీ సహకరించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలమూరు మండలం పెదపల్ల గ్రామం ఓఎన్జీసీ సైటు వద్ద గురువారం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. రూ.8,110 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందన్నారు.