ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చింతలూరు సాగునీటి సంఘం అధ్యక్షులు గారపాటి శ్రీనివాస్ చౌదరి అన్నారు. ఆలమూరు శివారు పెనికేరు, కలవచర్ల, గ్రామాల మధ్య రైతులకు సాగునీరు అందించే కోడు (నీటి కాలువ) పూడికతీత పనులను భారీ ప్రోక్లైన్ల సహకారంతో శనివారం ప్రారంభించారు. రైతుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు కూడా సహకరించాలని కోరారు.