ఆత్రేయపురం: వైభవంగా వాడపల్లి వెంకన్న సుప్రభాత సేవ

52చూసినవారు
ఆత్రేయపురం మండల పరిధిలోని వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ శనివారం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు, పండితులు మంత్రోచ్చారణల మధ్య స్వామి వారి మేలుకొలుపు సేవ జరిగింది. అనంతరం భక్తులను దైవ దర్శనానికి అనుమతించారు. స్వామివారి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. స్వామివారిని కన్నులారా వీక్షించి పునీతులయ్యారు.

సంబంధిత పోస్ట్