ఆత్రేయపురం మండలంలోని ఉచ్చిల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాజవరం గ్రామానికి చెందిన తాతారావు, రాంబాబు, ఫణీంద్రలు రావులపాలెం నుంచి స్వగ్రామానికి బైక్ పై వెళ్తుండగా అదుపుతప్పి కింద పడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు.