ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శనివారం గోవింద నామస్మరణతో హోరెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులు తండోప తండాలుగా తరలివచ్చారు. ఏడు శనివారాల స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలమని భక్తులు భావిస్తారు. కోనసీమ తిరుమలగా భావించే వాడపల్లి వెంకటేశ్వరస్వామిని భక్తులు తమ ఇలవేల్పుగా భావిస్తారు.