కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెంది రోజురోజుకు విశేష భక్తుల ఆదరణ చూరగొంటున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వ్యాపార మైకుల గోల అధికమైంది. భక్తుల అసహనానికి గురిచేస్తున్నాయి. మానసిక ప్రశాంతత కోసం ఆలయానికి వస్తుంటే ఈ ఆలయం వద్ద కూడా ఇలాంటి మైకులు ఉండటం చాలా విచారకరం. ఇప్పటికైనా దేవస్థాన అధికారులు, కమిటీ వారు ఈ వ్యాపారాల గోల తగ్గిస్తే మంచిదని భక్తులు కోరుకుంటున్నారు.