ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం వేకువజామున నుండి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ సన్నిధిలో ఆలయ అర్చకులు స్వామివారికి మేలుకొలుపు, సుప్రభాత సేవలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారి ఆలయానికి తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.