వాడపల్లిలో వైభవంగా సుప్రభాత సేవ

58చూసినవారు
ఆత్రేయపురం మండల పరిధిలోని వాడపల్లి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ శనివారం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు, పండితులు మంత్రోచ్చారణలు మధ్య స్వామి వారి మేలుకొలుపు సేవ జరిగింది. అనంతరం భక్తుల దైవ దర్శనానికి అనుమతించారు. స్వామివారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. వేసవి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో మంచినీరు, మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్