రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాలను సోమవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కొత్తపేట ఆర్డీఓ కార్యాలయంలోవీక్షించే ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్డీఓ శ్రీకర్ హాజరయ్యారు.