ఆయుష్మాన్ భారత్ మందిరాల్లో వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కొత్తపేట మండలం వానపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గురువారం సీహెచ్వోలు శాంతియుత నిరసనను తెలియ జేశారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలాంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను వైద్యాధికారులకు అందజేశారు.