వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం మంగళవారం కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి బారులుతీరారు. నోము ఆచరిస్తున్న భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ.3,56,982 వచ్చినట్టు ఉప కమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.