భారత్ - పాకిస్దాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్దవాతావరణంలో శత్రుసైన్యాన్ని, శత్రుదేశాన్ని అంతమొందించే కార్యాచరణలో భాగంగా మన దేశం బాగుండాలని అన్ని మతాలవారు ప్రార్థనలు చేయాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి పాలూరి సత్యానందం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మన దేశం కోసం పోరాడుతున్న త్రివిధ దళాలు ఆత్మస్ధైర్యంతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.