ఆలమూరు: ముసలమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సుభాష్

62చూసినవారు
ఆలమూరు: ముసలమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సుభాష్
ఆలమూరు మండలం పెనికేరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు, శెట్టిబలిజ సంఘ పెద్దలు మంత్రి సుభాష్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో వైభవంగా జరిగే అమ్మవారి జాతర మహోత్సవాల సమయంలో ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్