ఆలమూరు మండలం పెదపళ్ళ గ్రామంలోని పీహెచ్సీ లో ఓఎన్జిసి నిధులు రూ 10 లక్షలు, మండల పరిషత్ నిధులు రెండు లక్షలతో నిర్మించిన అవుట్ పేషంట్ ఓపి షెడ్డును కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ షెడ్డు నిర్మాణం వల్ల అవుట్ పేషెంట్ వారికి ఇబ్బందులు తొలగనున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.