ప్రజా సమస్యల పరిష్కారం ప్రజాదర్బార్ యొక్క ముఖ్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గం లోని ప్రజల సమస్యలను వినతిపత్రం రూపంలో ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా దర్బార్ ద్వారా ఇప్పటికే అనేక సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు.