టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించండి

71చూసినవారు
టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించండి
విద్యా సంవత్సరం ప్రారంభం నుండి పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖాధికారిణి ఎం. కమల కుమారి ఉపాధ్యాయులకు సూచించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట జెడ్పీ బాలికోన్నత పాఠశాలను శనివారం ఆమె సందర్శించారు. అనంతరం పాఠశాల హెచ్ఎం ఎన్. సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన నేను బడికి పోతా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్