చంద్రవరం: విద్యార్థులకు పద్యాల పోటీలు

73చూసినవారు
చంద్రవరం: విద్యార్థులకు పద్యాల పోటీలు
చంద్రవరం శాఖా గ్రంథాలయంలో శనివారం సమ్మర్ క్యాంపులో విద్యార్థులచే మద్దిరాల శ్రీనివాసులు రచించిన" నగర దిష్టి"బాలల కథలు నుండి దేవుని మహిమ, శకునాల గోపయ్య, మంచి కాకి కథ, మారిన బామ్మ. మొదలగు కథలను చదివించారు. అనంతరంవేమన పద్యాలు, సుమతి పద్యాలు, భగవద్గీత శ్లోకాలను ఎంపీయూపీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ రమాంబ, విద్యార్థులచే చదివించారు. వాటి అర్థాలను వివరించారు. సమ్మర్ క్యాంపును ప్రతి విద్యార్థి వినియోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్