కొవ్వూరు డివిజన్లోని డీ-సిల్టేషన్ ఇసుక రీచ్ లను, దొండగుంట-2 డీ-సిల్టేషన్ ఇసుక రీచ్ లను బుధవారం రాత్రి తనిఖీ చేసినట్లు జిల్లా మైన్స్ అధికారి డి. ఫణి భూషణ్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఇసుకతో కూడిన ఒక డ్రెడ్జింగ్ బోట్ నుండి పోక్లైన్ సహాయంతో ఇసుకను దించుతుండగా గుర్తించమన్నారు. NGT నిభందనలు ఉల్లంఘించినందుకు డ్రెడ్జింగ్ బోట్ ను పట్టుకుని సీజ్ చేసినట్లు చెప్పారు.