కొవ్వూరు గ్రామం బ్రిడ్జి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొవ్వూరు పట్టణానికి చెందిన దాసరపూడి సుధ (45), కుమారుడు కలిసి బైక్ పై వెళుతుండగా ఇసుక లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తల్లి ఘటనా స్థలంలోనే మృతి చెందగా, కొడుకుకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.