కొవ్వూరు నియోజకవర్గంలోని పశివేదల, దోమ్మేరు, నందమూరు, వేములూరు గ్రామ రైతులు ఎదుర్కొంటున్న వక్ఫ్ బోర్డు & ఈనామ్ 22ఏ భూ సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు కలిసినట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు మంగళవారం తెలిపారు. రైతు భూ రక్షణ కోసం వినతిపత్రం, అధికారిక లేఖను అందజేసినట్లు తెలిపారు. సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. రైతుల సంక్షేమమే ధ్యేయమన్నారు.