తాళ్లపూడి మండలం పెద్దేవంకు చెందిన యువ అర్థశాస్త్ర పరిశోధకుడు కొణగల మణికంఠ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పీహెచ్. డి డిగ్రీను పొందారు. "క్రాప్ డైవర్సిఫికేషన్" అనే అంశంపై ఆయన చేసిన పరిశోధన గ్రంథాన్ని ప్రొఫెసర్ సూరె పుల్లారావు (అర్థశాస్త్ర విభాగాధిపతి) పర్యవేక్షణలో సమర్పించారు. కేవలం 2½ సంవత్సరాల్లోనే తన పరిశోధనను పూర్తి చేసి, అనేక స్కోపస్-ఇండెక్స్ జర్నల్స్లో పరిశోధనా వ్యాసాలు ప్రచురించడం గర్వకారణంగా నిలిచింది. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ చేతుల మీదుగా శనివారం పీహెచ్డీ డిగ్రీ స్వీకరించారు.