రాజమండ్రి సిటీ గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. రూ.5కే ఆహారం అందించే లక్ష్యాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు అధికారులు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. పరిశుభ్రత, సమయపాలన, సీసీ కెమెరాల ఏర్పాటుపైనా దృష్టి సారించాలని సూచించారు.