కోనసీమ జిల్లాలో అత్యున్నత ఫలితాల సాధనలో మండపేట మండలం ఏడిద జెడ్పీ ప్లస్ పాఠశాల ఆదర్శమని జిల్లా విద్యా శాఖ అధికారి సలీం బాషా పేర్కొన్నారు. ఇంటర్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను విద్యాశాఖ అధికారి భాషా గురువారం ఏడిద లో విద్యార్థులను సత్కరించారు. విద్యార్థుల ప్రవేశాలు, పాఠశాల ఆకర్షణ వారోత్సవాలలో భాగంగా ఏడిద జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ను సందర్శించారు. బడి ఆకర్షణ వారోత్సవాల ప్రాధాన్యతను వివరించారు.