మండపేట గౌతమి మునిసిపల్ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయి ఎక్స్పో పోటీల్లో ద్వితీయ స్థానం సాధించారు. రామచంద్రపురం ప్రభుత్వ జాతీయ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి ఈ ఏండీపీ ఎక్స్పో 2025 లో శ్రీ గౌతమి మున్సిపల్ హై స్కూల్ కు చెందిన 9వ తరగతి విద్యార్థులు జె కీర్తి శివ దేవి, వై ప్రవల్లిక, వై ప్రణీతలు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాషా, జిల్లా సైన్స్ అధికారి జీవి ఎస్ సుబ్రమణ్యం, విద్యార్థులను అభినందించారు.