విమాన ప్రమాదం మన దేశాన్ని తీవ్ర విషాదం లోకి నెట్టింది.. ఈ దుర్ఘటనలో అమూల్యమైన ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల రాజేష్ అన్నారు. మండపేటలో శుక్రవారం అయిన మాట్లాడుతూ బాధిత కుటుంబాల బాధను ఊహించుకోవడమే చాలా కష్టమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. వారి మనో ధైర్యానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.