కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లబ్దిదారునికి గురువారం ఫించన్ అందజేశారు. మండపేట 14వ సచివాలయం పరిధిలో సంఘం కాలనీకి చెందిన మేడిశెట్టి సత్యనారాయణ అనారోగ్యంతో కాకినాడలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయం సానిటరీ సెక్రటరీ రాజేంద్ర గురువారం కాకినాడ వెళ్లి ఫించన్ సొమ్ములు అందజేశారు. సెక్రటరీ రాజేంద్రను కమిషనర్ బి రాము అభినందించారు.